Thursday, November 6, 2014

నిషిద్ధాక్షరి - 16


శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో ...
రామపట్టాభిషేకాన్ని వర్ణిస్తూ తేటగీతి వ్రాయండి.
మొదటిపాదాన్ని ‘రా’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘మ’ నిషిద్ధం.
రెండవపాదాన్ని ‘భ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘ర’ నిషిద్ధం.
మూడవపాదాన్ని ‘ల’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘క్ష్మ’ నిషిద్ధం.
నాలుగవపాదాన్ని ‘శ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘త్రు’ నిషిద్ధం.
నిషిద్ధాక్షరాలు కేవలం పాదంలో రెండవస్థానానికే పరిమితం. పద్యంలో మిగిలిన స్థానాలలో వాడవచ్చు.




 రాజ్య పట్టాభిషిక్తుడౌ రామునకును
భక్తి మీరగ మారుతి పరిచరించ
లక్షణంబుగ శత్రఘ్న లక్ష్మణుండు
శక్తిశాలురు జనులంత జయములిడగ
రమణి సీతమ్మతల్లితో రహిని గాంచె!!!

No comments:

Post a Comment