Monday, June 24, 2013

శ్రీశైలశిఖరం దృష్ట్వా .... పునర్జన్మ నవిద్యతే...

ద్వాదశ జ్యోతర్లింగాలు, అష్ఠాదశ శక్తి పీఠాలలో శ్రీశైలం ప్రత్యేకమైనది.  కారణం అమ్మవారు భ్రమరాంబా దేవి రూపంలో మల్లిఖార్జునుని ఆలయం పైభాగంలో కొలువై ఉంటారు.
అంతేకాక జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే ప్రదేశంలో కొలువై ఉండటం కూడా.
కొత్త ప్రదేశాలు చూడడమంటే అందరిలాగే నాకూ మహా ఇష్టం.

హైదరాబాదునుండీ కారులో.. ప్రయాణం ఒక మధురానుభూతి.. శంశాబాద్ ఎయిర్పోర్టు కు 40 కి.మీ. దాటగానే శ్రీశైలం బోర్డు దర్శనమిచ్చి, మనం సరైనదారిలో ప్రయాణిస్తున్నామన్న భరోసా కలగచేస్తుంది.
మరో 45 కి.మీ. వెశుతూనే మన్ననూరు చెక్పోస్టు వస్తుంది.  అక్కడే ఫారెస్టు గెస్టు హౌసుకూడా వుంది.  రాత్రి అడవిలోకి ప్రవేశం నిషిద్దం. రాత్రి అయిపోయి ప్రయాణం వీలులేనప్పుడు అక్కడ బస చేయ వచ్చు.


ఇక అక్కడనుండి ...నల్లమల అడవులు ప్రారంభమవుతాయి.....ఎటుచూసినా పచ్చని ప్రకృతికాంత... ఆకుపచ్చని చీరలో అందంగా ముస్తాబైనట్లుంటుంది...అలా  అలా ..సాగే పయనంలో ....ఠీవిగా అల్లుకుపోయి,..సుశిక్షతులైన సైనికుల్లా దారికి రెండువైపులా ఏపుగా పెరిగిన వెదురు వనాలు..టేక్ కేర్ అని చెప్తుంటాయి...
మార్గమధ్యలో రిజర్వుపారెస్టువారి ..టైగర్జోన్  హెచ్చరికలతో పెద్ద, పెద్ద హోర్డింగ్స్...ఎదురయ్యే జంతువులకి ఏమీఫీడ్ చేయొద్దన్న బోర్డులు అడుగుగున కన్పిస్తునే వుంటాయి... ...అతి ప్రశాంత వాతావరణం...వృక్షరాజాలు చేసే సంగీత స్వరాలు తప్ప మరే రొదలూలేని నిశ్శబ్దం...అప్పుడపుడూ ఎదురయ్యే వాహనాలు..అలాగే ...ఆగాలనిపించే చిన్న, చిన్న, కేంటీన్లు...దట్టమైన వృక్షాల సముదాయం..టైగర్స్ జోన్ దగ్గర టికెట్స్ తీసుకుని టైగర్స్ ని చూడవచ్చు....
అన్నిటినీ మించి అమితంగా.. అందరినీ ఆకట్టుకునేవి..అవే..మన నేస్తాలు..చుట్టాలు..మానవుడి మూలాలు..ఏవంటారా...
వానర సమూహాలు..దారి పొడవునా తమ కుటుంబాలతో హాయిగా , స్వేచ్చగా, ఆడుకుంటూ,..వచ్చే వాహనాల దగ్గరికి అడ్డువస్తూ,..ఆగితే చాలు..సకుటుంబ సపరివార సమేతంగా ..మన దగ్గరకి వచ్చి ..వాటి చేష్టలతో ఏవైనా పెట్టమని అడుగుతుంటాయి...

ఇంతమంది చుట్టాలు ఎదురవుతారని తెలియని నేను కించిత్ భాధపడ్డాను ..ఏవీ తేనందుకు,,అప్పుడు గుర్తొచ్చింది..మంచి ముఖిరీ అరటిపళ్లు వున్న సంగతి...అవి తీసి వాటిని సగం,కట్ చేసి, ఆగినపుడల్లా దగ్గరకు వచ్చిన వాటికి అందించాను...ఎంత బాగా చేత్తో అందుకుని ...తీరిగ్గా చెట్లదగ్గరకి వెళ్లి తిన్నాయి...
వాటి హావభావాలు దగ్గరనుండి చూస్తూంటే చాలా గమ్మత్తుగా అన్పించింది...వెంటనే వాటిని నా కెమేరాలో బందించాను...
ఎగిరే మయూరాలు..పక్షుల కువకువలు..జింకలపరుగులు    .గాలి చేసే ధ్వనులు...వింటూ,..నల్లమల అడవుల అందాలను ఆస్వాదిస్తూండగా ..నాగార్జునసాగర్ డేమ్ వచ్చింది ..అక్కడ దిగి తనివితీరా సాగర్ని చూసి పులకించి పోయాం...చిన్నప్పటి క్లాస్ పుస్తకాలలో చదువుకున్న నాగార్జునసాగర్ ని ఎదురుగా చూస్తూవుంటే చెప్పలేని ఆనందం కల్గింది.

..ఆ ఆనందాన్ని మననం చేసుకుంటూ ...వుండగానే వచ్చేసింది శ్రీశైలం...
ముందుగా సాక్షిగణపతి దేవాలయం వస్తుంది.. అక్కడ చేతిలో పుస్తకం కలం, ధరియించి సుందరరూపంతో కొలువైన గణపతిని సేవించి . మన గోత్రనామాలు చెప్పాలి..అవి గణపతి వ్రాసుకుంటారట...శ్రీశైలం చూడటానికి వచ్చేవారు ....వచ్చేటపుడు,..., తిరిగి వెళ్ళేటపుడు ,...సాక్షిగణపతికి చెప్పి వెళ్తారు...


మల్లికార్జునస్వామి , భ్రమారాంబల దర్శనం అలౌకిక ఆనందాన్ని ఇచ్చింది..అక్కడికి కొంచం దూరంలో వున్న శ్రీశైల శిఖర దర్శనం కొంచం కష్టం కలిగించింది..ఎందుకంటే ..మేము వెళ్ళినది వేసవి ఎండలలో.. ఎక్కువ భాగం చెప్పులు లేకుండా నడవాలి.. ..శిఖరం చూడడానికి చాలా మెట్లు ఎక్కాలి ..అదే ఉదయంగానీ ,..సాయంకాలం కానీ అయితే  సమస్యలేదు...

అయినా ఆ మాత్రం కష్టం లేకుండా ఆ శక్తిస్వరూపాలని చూడలనుకోవడం... సాధ్యమా...అయినా కష్టే ఫలి అంటారుగా...

శ్రీశైలం నుంచి తిరిగి వస్తునపుడు మళ్ళీ సాక్షి గణపతిని దర్శించి..స్వామిని , దేవేరిని చూసి వెళ్తున్నాం...అందుకు నువ్వే సాక్షి ..అని ఆలయంలో గణపతికి విన్నవించి రావాలిట...మేము అలాగే సాక్షిగణపతికి చెప్పి ...అలవికాని ఆత్మానందంతో ,శ్రీశైల మల్లన్నకి మరోమారు నమస్కరించి .....హైవే ఎక్కాం...

1 comment: