Wednesday, November 5, 2014

నిషిద్ధాక్షరి - 11

 శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతలతో....


 అనుస్వారాన్ని ఉపయోగించకుండా
పెండ్లి విందును గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.



విరిసిన మమతల తోడన్
మురియుచు నావడలు, బూరె, పులిహోరలతో
యరిసెలు మరి పాయసముల
పరిణయ భోజనము తినగ ప్రమదము గాదే!




 వరుస భోజనము లుపోయి పళ్లెము లను బట్టుచున్
మురిసి తినగ నొక్కమారె ముచ్చెమటలు బట్టునే
పరిణయమున భోజనములు ఫాస్ట్ ఫుడ్డు బోలగన్
వెరసి జూడ మొక్కుబడి గ వేడుకయ్యె నేడుగా!

No comments:

Post a Comment