Wednesday, April 2, 2014

పద్య రచన...548 ( త్రిశంకుస్వర్గం)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....





మునివరుడా గాధిసుతుడు
ననువుగ సృజియించెనాడు నద్భుత రీతిన్
ఘనముగ త్రిశంకు కోసము
వినువీధిన సృష్టి జేసె వేరొక దివినే



నేతల మాటలు వినగా
గోతిన్ బడద్రోయనేమొ గొప్పగ జనులన్
భూతల త్రిశంకు దివియిది
ఏతావాతా నరయగ నేమగు నేమో!

No comments:

Post a Comment