Wednesday, April 2, 2014

ప్రహేళిక -52

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....

 ఫ్రహేళిక ...- 52




తండ్రికొడుకు లొక్క తరుణిని రమియింప
పుత్రు లిద్ద రొంది పోరు గలుగ
నొకని జంపి రాజ్య మొకని కిచ్చిన ప్రభు
వాతఁ డిచ్చు మనకు నఖిల సిరులు. 



సమాధానం...

 తండ్రి కొడుకులైన తరణి యముల చేత
కర్ణ ధర్మజులను గనెను కుంతి
సమరమందు కర్ణుఁ జంపించి ధర్మజు
నవనిపతిగఁ జేసె హరియె గాదె.

No comments:

Post a Comment