Saturday, August 15, 2009

పసి బోసి చిరునవ్వురా ...

" ఈ జెండా పసి బోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెన్చిందిరా ..
ఈ జెండా అమరుల తుదిశ్వాసరా ..
రక్త తిలకాలు దిద్దిన్దిరా ...
వందే మాతరం ... మనదే ఈ తరం .."

ప్రస్తుత పరిస్థితి " వంద ఏ మాత్రం , మనదే ఆయుధం " అన్న రీతి లో వుంది, కుక్కపిల్ల , అగ్గిపుల్ల , సబ్బుబిళ్ళ , కాదేది కవిత కనర్హం అన్నారు కవి శ్రీ శ్రీ , అదే ఇప్పుడయితే ఏమంటారో తెలుసా ? .. యాసిడ్ బాటిల్, పురుగులమందు, తాడు, బ్లేడు , చాకు, మేకు, కాదేది యువత కనర్హం అందురు .. యువతరం అంతటినీ నేననటం లేదు , చాలామందియువత ,తల్లితండ్రులని , దేశాన్ని, గురువులని, తోదబుట్టినవారిని ప్రేమించి ,అభిమానించే వారున్నారు , కానీతెనేతుట్టేకి పైన అల్లుకుని ఆ తేనే కనిపించకుండా వుంటాయి తేనెటీగలు , ఆ తెనేటేగాలని దులిపెదెవరు ? కమ్మనైన ఆ తేనే తీయదనం నలువైపులా పంచేదెవరు ? మంచిని ఆవరించి చెడు విశ్వవ్యాప్త మైతే ఏఁ చేయగలం ? ..
మహాత్మ్డు డు మళ్ళీ పుట్టి అందరినీ ఒక తాటి మీద నడిపిస్తే , అశాంతి వనం లో శాంతి పూలు వికసిస్తే , అంతకంటేభారత భారతి కి ఆనంద మేముంటుంది .. ? .. అలాంటి రోజుల రోజాలు అరుదెంచునా ..! ఈ యుగానికి అలాంటివుగాదినీ ఆశించడం అత్యాస అవుతుందంటారా .. ? వేచి చూడటం తప్ప పేచీ , పూచీ , ఏముంది ?.

మంచి మనసులకి . మంచి మనుషులకి , మరోసారి , వందనం చేస్తూ .. వూపిరి వున్నతవరకు " వందే మాతరం , అందాం అందరం " ...

3 comments:

  1. avunu sailaja gaaru
    anni manavaipu nunche aalochinchakoodadu anDi avathala vaari vaipununchi kooda aoachinchaali....

    dayachesi word verificcation theeseyyaru........

    ReplyDelete